📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తా : రాజశేఖరం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 4, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మరో విజయం సాధించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన ఓట్లు (51శాతం) రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్‌ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టరు ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయన్నారు.

కూటమి అభ్యర్థిగా విజయం సాధించినందుకు సంతోషం

ఏడు రౌండ్‌లు పూర్తయ్యేసరికి.. మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వాటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా.. చెల్లనివి 17,578 ఓట్లున్నాయి. దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. కూటమి అభ్యర్థిగా ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, రెండు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. ఈ 8 నెలల కాలంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత లేకుండా, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా నా వంతు ప్రయత్నం చేస్తా అని తెలిపారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu mlc candidate Perabattula Rajasekharam TDP Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.