📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి

Author Icon By Sudheer
Updated: January 30, 2025 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, తమ పార్టీ గెలిచిన వెంటనే టీడీపీకి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కడప, రాయచోటి ప్రాంతాల్లో జరిగిన వైసీపీ సమన్వయ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని, ఇదంతా చంద్రబాబు సహా టీడీపీ పెద్దల ప్రేరేపణతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, తాము అధికారం లోకి రాగానే దీన్ని ఖచ్చితంగా ప్రతిదాడులతో ఎదుర్కొంటామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, ఎవరూ భయపడవద్దని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధైర్యం ఇచ్చారు. గతంలో టీడీపీ చేసిన అన్యాయాలకు బదులు తీర్చుకునేందుకు సమయం వస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చూపిస్తున్న వేధింపులకు భయపడకుండా, పార్టీకి అండగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తమ హయాంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగిందని, కానీ టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని, అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

Chandrababu Google news Peddireddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.