Wetlands: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan) రాష్ట్రంలోని చిత్తడి నేలల సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి దారితీసే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన స్టేట్ వెట్ల్యాండ్ అథారిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ భావితరాల భవిష్యత్తు కోసం అవసరం. అదే సమయంలో ఎకో టూరిజం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందించాలి” అని తెలిపారు.
Modi Tour : శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 16 చిత్తడి నేలల గుర్తింపు
Wetlands
పవన్ కల్యాణ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో ఒకేసారి 16 ప్రధాన చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. దక్షిణ భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున వెట్ల్యాండ్ ప్రాంతాలను అధికారికంగా గుర్తిస్తున్నామని తెలిపారు. సోంపేట, తవిటి మండలాల్లోని పెద్ద బీల, చిన బీల, తుంపర ప్రాంతాలను అనుసంధానిస్తూ ఎకో టూరిజం కారిడార్ ప్రాజెక్టును రూపుదిద్దనున్నట్లు పవన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణ అవగాహన పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.
పక్షి సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
వీరాపురం (అనంతపురం జిల్లా) మరియు రాజమండ్రి (Rajahmundry) సమీపంలోని పుణ్యక్షేత్రం చిత్తడి నేలల్లో ప్రత్యేక బర్డ్ కన్జర్వేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అరుదైన పక్షి జాతుల సంరక్షణతో పాటు ఈ ప్రాంతాలను పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత పెద్ద రాంసర్ గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ సూచించారు. ఇందుకోసం “కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ” ఏర్పాటు చేయాలని అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
భౌగోళిక సరిహద్దుల గుర్తింపు వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా 23,450 చిత్తడి నేలల (wetlands) భౌగోళిక సరిహద్దుల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. వీటిలో 99 శాతం ప్రాంతాలకు డిజిటల్ మ్యాపింగ్ పూర్తి అయిందని, అక్టోబర్ 28 లోపు భౌతిక సరిహద్దుల గుర్తింపును పూర్తి చేయాలని ఆదేశించారు. Wetlands “చిత్తడి నేలలు భూగర్భ జలాల నిల్వ, వర్షాకాల ప్రవాహ నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కీలకం. వీటి సంరక్షణ మన భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉంటుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ సమావేశంలో సీసీఎల్ఏ జయలక్ష్మి, పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, డబ్ల్యూడబ్ల్యుఎఫ్ ఇండియా ప్రతినిధి ఫరిదా థంపాల్, శాస్త్రవేత్తలు డాక్టర్ రామ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ గోల్డిన్ ఖుద్రోస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్ని చిత్తడి నేలలను గుర్తించారు?
ఒకేసారి 16 చిత్తడి నేలలను అధికారికంగా గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది.
సోంపేటలో ఏ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు?
పెద్ద బీల, చిన బీల, తుంపర ప్రాంతాలను అనుసంధానిస్తూ ఎకో టూరిజం కారిడార్ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: