Telugu News: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

Read Time:  1 min
Weather Update
Weather Update
FONT SIZE
GET APP

మొంథా తుపాను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం(Weather Update) పూర్తిగా మారిపోయింది. వర్షాలు తగ్గిపోగా, చలి తీవ్రత మాత్రం గణనీయంగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా చలిగాలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయ్యాయి.

Read Also: Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత

Weather Update
Weather Update

నవంబర్ 9న మరింత చలి అవకాశం
వాతావరణ శాఖ(Meteorological Department) ప్రకారం నవంబర్ 9న ఉష్ణోగ్రతలు(Weather Update) మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే పటాన్‌చెరు ఈక్రిశాట్‌లో 19.4, హయత్‌నగర్‌లో 19.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 34.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా వాతావరణం పొడి గానే ఉండే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి విస్తరణ
ఏపీలో కూడా చలి ప్రభావం పెరిగింది. పాడేరు (14.2 డిగ్రీలు), అరకు (14.9 డిగ్రీల సెల్సియస్‌)లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట పొగమంచుతో పాటు చలి మరింతగా అనిపిస్తోంది. అదనంగా కోనసీమ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్ష సూచనలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.