విజయనగరం(Vizianagaram) జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నడిపేన శ్రీనివాసరావు (58) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాశీయాత్రకు వెళ్లిన ప్రయాణికులతో తిరిగి వస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా బాహానాగ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also: Kurnool Incident: చీర ఊయలే ఉరి తాడైంది.. బాలుడి మృతి
ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, అనంతరం బ్రిడ్జి కింద పడిపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.
శ్రీనివాసరావు అనుభవజ్ఞుడైన డ్రైవర్గా ట్రావెల్స్ రంగంలో మంచి పేరు సంపాదించారు. అయితే విధి వశాత్తు జరిగిన ఈ ప్రమాదం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సుమారు ఎనిమిది నెలల క్రితం ఇదే తరహా రోడ్డు ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు పురుషోత్తం కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం ఇప్పటికే గుండె పగిలే దుఃఖంలో ఉంది. ఇప్పుడు తండ్రి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. డ్రైవర్కు నిద్రమత్తు లేదా వేగం అధికంగా ఉండటం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానికులు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: