हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Vizag meeting: సిఐఐ సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు

Saritha
Latest news: Vizag meeting: సిఐఐ సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు

విశాఖపట్నం : విశాఖలో జరుగుతున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు(Vizag meeting) తొలిరోజు పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. శుక్రవారం ముఖ్యమంత్రి సమక్షంలో 41 ఒప్పందాలు, మంత్రుల సమక్షంలో మరో 324 ఒప్పందాలు జరిగాయి. మొత్తం 365 కంపెనీలు రూ.8,26,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తద్వారా 12,05,174 ఉద్యోగాలు రానున్నాయి. ఈరోజు వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికంగా 121 వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందినవే ఉన్నాయి. తర్వాత స్థానంలో ఐటీఈ అండ్ సీ 95, విద్యుత్ రంగానికి చెందిన సంస్థలు 44 రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నాయి. సీఐఐ సమ్మిట్ రెండు రోజులు కలిపి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనావేయగా, అందరి అంచనాలను మించి ఒక్కరోజులోనే పెట్టుబడులు రావడం రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసింది.

Read also: బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం?

Vizag meeting
Vizag meeting

సిఎం సమక్షంలో 41 ఒప్పందాలు

సిఎం చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒకేసారి 41 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ 41 సంస్థలు మొత్తం రూ.3,50,186 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టనున్నాయి. దీంతో 4,16,290 మందికి ఉద్యోగాలు(Vizag meeting) దక్కనున్నాయి. ఎంఓయూ చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఎల్, జెఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్. హిందుస్థాన్ షిప్యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధనరెడ్డి, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.

సమ్మిట్కు ముందురోజు 35 ఎంఓయులు

సమ్మిట్కు ముందు రోజు 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయి. 1,26,471 రానున్నాయి. మొత్తంగా గురు, శుక్రవారాలు రెండ్రోజుల్లో రాష్ట్రానికి రూ.11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 400 సంస్థలు పెడుతున్న ఈ పెట్టుబడులతో 13,32,445 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870