ఐటీ పెట్టుబడులకు విశాఖ డెస్టినేషన్ సిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం, రాష్ట్రానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో సగం వరకు విశాఖపట్నం(Visakhapatnam IT Hub) వాటా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నగరాన్ని కేంద్రంగా తీసుకుని నాలుగు జిల్లాలను కలుపుతూ ఒక ఎకనమిక్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే, “డబుల్ ఇంజిన్ సర్కార్”తో ఏపీ బులెట్ ట్రైన్లా వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని పేర్కొన్నారు.
Read also : Gulf Tour Denied: కేరళ సీఎం గోల్ఫ్ పర్యటనను రద్దు చేసిన కేంద్రం

సిఫీ ఏఐ డేటా సెంటర్ – విశాఖలో కొత్త మైలురాయి
విశాఖపట్నంలో సిఫీ ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్(Visakhapatnam IT Hub) మరియు ఓపెన్ కేబుల్ ల్యాండ్ స్టేషన్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్(Madhav), సిఫీ ఛైర్మన్ మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ – గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటివల్ల 5 లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని లోకేష్ తెలిపారు. ప్లాంట్ అభివృద్ధి కోసం ఇప్పటికే ₹14,000 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు.
విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, 2047 నాటికి నగర ఆదాయం 1 ట్రిలియన్ డాలర్లకు చేరడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: