విశాఖపట్నం సింహాచలం(Visakhapatnam Crime) పరిసరాల్లో ఓ లాడ్జిలో తల్లి–కొడుకులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సింహాచలం దర్శనానికి వచ్చిన వారు గదిలో బలవన్మరణానికి పాల్పడటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమస్యలే కారణమా? లేక కొడుకు మానసిక వేదన(MentalStress) ఈ ఘటనకు దారితీసిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Vizianagaram Crime: పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు ఆత్మహత్య

పాత గాజువాకకు చెందిన నీలవతి, ఆమె కుమారుడు గయప్పాంజన్తో కలిసి గురువారం సింహాచలం వచ్చారు. అడవివర ప్రాంతంలోని ‘సిరి చందన’ లాడ్జిలో ఒక గదిని బుక్ చేసుకుని, శుక్రవారం ఆలయ దర్శనం ముగించుకొని తిరిగి గదికి చేరుకున్నారు. ఆ తర్వాత బయటకు రాని తల్లి–కొడుకులను గమనించిన లాడ్జి యజమాని సుధాకర్ పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో అనుమానం పెరిగి పోలీసులకు సమాచారం అందించారు.
లాడ్జిలో దారుణ ఘటనతో కలకలం
సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు(Visakhapatnam Crime) అక్కడికి చేరుకుని కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలి పరిస్థితిని పరిశీలించారు. గదిలో తల్లి, కొడుకు సీలింగ్ హుక్కుకు ఉరివేసుకుని మరణించినట్లు గుర్తించారు. తలుపు విరగ్గొట్టిన అనంతరం మృతదేహాలను బయటకు తీసి పీఎంవీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు.
మృతుడు గయప్పాంజన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. 2021లో ఆయన వివాహం జరిగినప్పటి నుండి భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, 2023లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో గయప్పాంజన్పై కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. వివాదాల నేపథ్యంలో భార్య నుండి వేరుగా ఉంటున్న ఆయన కొంతకాలంగా మానసిక ఆవేదనతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు అడుగు అడుగుకు విచారణ కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: