ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య సంక్షోభం
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం(Health) ఆందోళన కలిగించే స్థితికి చేరుకుంది. ఇటీవల కురుపాం(Viral fever) ప్రాంతంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 150 మందికి పైగా జాండీస్ (పిత్త జ్వరం) లక్షణాలు కనిపించాయి. ఈ లోపు ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం తీవ్ర కలకలం రేపింది. ఇది ఇంకా మిగిలి పోకముందే, సాలూరు సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 2,900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 21 మందికి తీవ్రమైన జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు.
Read also: జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్ షా

మూలకారణం పారిశుధ్య లోపాలు
వైద్య నిపుణులు, స్థానిక అధికారులు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా స్కూళ్లలో శుభ్రత లేకపోవడం, ముఖ్యంగా ఏళ్ల తరబడి నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. మలేరియా, జాండీస్(Viral fever) లాంటి వ్యాధుల ప్రబలతను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోంది. జ్వరాల లక్షణాలు ఉన్న విద్యార్థులకు వైద్యం అందించబడుతోంది. అయితే, దీర్ఘకాలికంగా ఈ సమస్యల పరిష్కారానికి పాఠశాలల పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: