కోట వినుత స్పష్టం – “డ్రైవర్ రాయుడు హత్యకేసుతో నాకు సంబంధం లేదు”
శ్రీకాళహస్తి జనసేన(Janasena) సస్పెండెడ్ నేత కోట వినుత (vinutha kota) చెన్నై నుంచి విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో, డ్రైవర్ రాయుడు హత్యకేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము నిర్దోషులమని, కోర్టు ద్వారా క్లీన్ చిట్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను కలిసి అన్ని విషయాలు వివరించనున్నట్లు తెలిపారు. “మేము ప్రజాసేవ కోసం విదేశాల్లో ఉన్న ఉద్యోగాలు వదిలాం, ఎవరి ప్రాణాలు తీసేందుకు రాజకీయాల్లోకి రాలేదు,” అని వినుత పేర్కొన్నారు. కోర్టు విచారణ కొనసాగుతున్నందున ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడలేనని, ఆధారాలతో త్వరలో మీడియా ముందు వస్తానని చెప్పారు.
Read Also: Israel: ట్రంప్ లాంటి వాళ్ళు ప్రపంచానికి అవసరమే
రాయుడు వీడియోతో కొత్త మలుపు
ఇదిలా ఉండగా, కోట వినుత (vinutha kota) మరియు ఆమె భర్త చంద్రబాబు ప్రైవేట్ వీడియోలు పంపిస్తే రూ.30 లక్షలు ఇస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ప్రతినిధులు చెప్పారంటూ, డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన 19 నిమిషాల 42 సెకన్ల వీడియో మళ్లీ వైరల్గా మారింది. ఆ వీడియోలో రాయుడు తనను బెదిరించారని, వినుత దంపతులను చంపాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. జూలై 7న రాయుడు హత్యకు గురవగా, జూలై 13న చెన్నై కూవం నదిలో మృతదేహం లభించింది. ఈ కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు అరెస్టయ్యారు. చెన్నై సెషన్స్ కోర్టు ఇటీవల కోట వినుతకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అయితే మిగిలిన నిందితులు ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: