Telugu News: Vinod Kumar: కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్.. ఆపై విడుదల

Read Time:  1 min
Vinod Kumar
Vinod Kumar
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని కలిగించిన కర్నూలు జిల్లా బస్సు అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరైన వేమూరి కావేరి ట్రావెల్స్ (Travel) యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను(Vinod Kumar) కర్నూలు పోలీసులు శుక్రవారం రోజున అరెస్ట్ చేశారు. అయితే, కోర్టులో హాజరుపరిచిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు.

గత నెల అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న కావేరి ట్రావెల్స్‌కు (Kaveri Travels) చెందిన ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ మండలం చిన్నటేకూరు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భయంకరమైన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read also: Latest News: Recharge: రీఛార్జ్‌ రేట్లు మళ్లీ పెరగనున్నాయా?  

Vinod Kumar
Vinod Kumar

బస్సు యజమానికి బెయిల్ మంజూరు

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను (A1 నిందితుడు) అరెస్ట్ చేశారు. తాజాగా, బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను (A2 నిందితుడుగా) పేర్కొంటూ అరెస్ట్ చేసి, ప్రత్యేక మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి,రూ. 10 వేల సొంత పూచీకత్తుపై వినోద్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు

ప్రమాదానికి గురైన బస్సు విషయంలో యాజమాన్యంపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సీటింగ్ సామర్థ్యం (పర్మిషన్) ఉన్న బస్సును నిబంధనలకు విరుద్ధంగా ‘స్లీపర్ కోచ్’గా మార్చి నడుపుతున్నట్లు రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఉల్లంఘన కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు రవాణా శాఖ కఠినమైన నిబంధనలను, పర్యవేక్షణను అమలు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.