ఆంధ్రప్రదేశ్, జేఏసీ చైర్మన్గా ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేఏసీ సమావేశంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ (Vijayawada) లోని ఎన్జీవో హోంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also: AP: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాను కోరిన CM
కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.
AP JAC అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ సంయుక్త కార్యాచరణ కమిటీ, ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మిక సంఘాలు కలిసి తమ సమస్యలు, డిమాండ్లపై ఐక్యంగా పోరాడేందుకు ఏర్పడిన కమిటీ.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: