Vijayawada news : విజయవాడ నగరం మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తతతో కదిలింది. న్యూ ఆటోనగర్లోని ఒక భవనంపై పోలీసులు దాడి చేసి, అక్కడ తలదాచుకున్న 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.
ఇంటెలిజెన్స్ శాఖ నుంచి ముందస్తు సమాచారం అందిన వెంటనే, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమన్వయంతో అక్టోపస్, ఇంటెలిజెన్స్ వింగ్, ఏపీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్పై దాడి
ఎస్పీ మాట్లాడుతూ :
“విజయవాడను షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాం. అందుకున్న ఆధారాల మేరకు 28 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం,” అని తెలిపారు.
హిడ్మా బెటాలియన్కు చెందిన 19 మంది
మరో వైపు, మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారని అధికారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే, (Vijayawada news) భారీ సంఖ్యలో మావోయిస్టులు విజయవాడలో పట్టుబడటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని, వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :