📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijayawada: నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కలశ స్థాపన, ధ్వజారోహణం

ఇంద్రకీలాద్రి : విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుండి శివరాత్రి (Shivaratri) మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం కలశ స్థాపన, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపనలతో ప్రారంభం అవుతాయి. శుక్రవారం ఉదయం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్లకు మంగళస్నానములు నిర్వహించి నూతన వధూవరులుగా అలంకరిస్తారని, మూల హవనములు, బలిహరణ, హారతి మంత్రపుష్పం, జరిపి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా గణపతి పూజ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, బలిహరణ, హారతి, మంత్రపుష్పం జరుగుతాయన్నారు.

Read Also: AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

(Vijayawada) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అన్నదాన పథకానికి గురువారం హైదరాబాద్కు చెందిన వి సుబ్బలక్ష్మి, వి గున్నేశ్వరరావు కుటుంబసభ్యులు రూ. 1లక్షను విరాళంగా అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా బీమవరంకు చెందిన గుప్త దాతలు (వారిపేర్లు నమోదు చెయ్యలేదు) రు. 1,01,1160 విరాళం నిత్యాన్నదాన పథకానికి అందించారు. దాతలకు దుర్గమ్మవారి ఏర్పాటు చేసి. దుర్గమ్మవారి చిత్రపటం, ప్రసాదం, మెమొంటో అందించారు. వేదపండితులు వేదాశీర్వచనం పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:




indrakeeladri Latest News in Telugu Shiva Rathri Shivaratri Festival Sri Kanaka Durga Temple Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.