విజయవాడ: Vijayawada crime పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని వివరాలు ఇలా దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఏడాదిన్నరగా విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
Read Also: Kurnool: కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు
ఆసుపత్రి వద్దే దారుణం
దీపాల విజయ్ భవానీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తుండగా, సరస్వతి సూర్యారావుపేటలోని(Suryaraopet) ఒక ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య నూజివీడులో ఉంటూ రోజూ విధులకు వచ్చి వెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో, భర్త విజయ్ మధ్యాహ్నం విధుల్లో ఉన్న సరస్వతిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతుపై విచక్షణారహితంగా పొడవడంతో, ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రజలను బెదిరించిన నిందితుడు, అరెస్ట్
ఈ దారుణ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను కూడా నిందితుడు విజయ్ బెదిరించాడు. దీంతో అక్కడున్న ప్రజలు భయపడి ఆమెను కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడు విజయ్ను అరెస్ట్ చేశారు. అనుమానంతోనే భార్యను హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: