📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Vijayawada: సచివాలయ ప్రవేశ విధానంలో మార్పులు

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్ర సచివాలయంలో భద్రతను ఎపి ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. ఆ క్రమంలొ ప్రవేశద్వారాల వద్ద నూతన సాంకేతిక వ్యవస్థ (Technical system) ను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పరికరాలు వచ్చాయి. ప్రవేశద్వారాల వద్ద వాటిని అమరుస్తున్నారు. అది పూర్తికాగానే సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, పాత్రికేయు లకు స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డునకు అదనంగా ఇది ఉంటుంది. ప్లెయిన్గా ఉండే ఈ కార్డులోని చిప్లో మనకు సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని స్కాన్ చేయగానే డేటాబేస్లో ఉన్న వివరాలతో సరి పోల్చు టకొని ఆటోమేటిక్గా తలుపులు తెరుచు కుంటాయి.

Vijayawada: సచివాలయ ప్రవేశ విధానంలో మార్పులు

పూర్తికాగానే

బెంగుళూరుకు చెందిన ‘సత్యాలజీ’ (Satyology) అనే సంస్థకు ప్రభుత్వం ఈ భాధ్యతలు అప్పగించింది. వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిథులుతెలిపారు. వాహనాల్లోవచ్చే ఉద్యో గులు, సిబ్బందికి రేడియో ఫ్రీకెస్సీ గుర్తింపు (ఆర్ఎఫ్ఎడీ)ను ఇస్తారు. ఈ ఆర్ఎఫ్త స్టిక్కర్ను వాహనం ముందు అతికిస్తారు. దాన్ని ‘బూమ్ వారియర్’ (Boom Warrior) స్కాన్ చేస్తుంది. అనంతరమే గేట్లు తెరుచుకుంటాయి. ఫాస్ట్ ట్యాగ్ తరహాలో ఇది పని చేస్తుంది. ఇందుకు ఉద్యోగుల వాహనాల నెంబర్ లను ఓ డేటాబేస్లో నిక్షిప్తం చేయనున్నారు.

ఏపీ సచివాలయం అంటే ఏమిటి?

ఏపీ సచివాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యాలయ సముదాయం. ఇది ముఖ్యమంత్రి, మంత్రులు,ముఖ్యశాఖల అధికారుల కార్యాలయాల కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, ఫైల్ ప్రాసెసింగ్, పరిపాలనా కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ప్రస్తుతం ఏపీ సచివాలయం అమరావతిలో ఉంది.

సచివాలయంలో ఏవేవి శాఖలు పనిచేస్తాయి?

సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం సహా పలు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఉదాహరణకు: రెవెన్యూ, హోం, విద్య, ఆరోగ్య, పురపాలక, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖలు మొదలైనవి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Director Vikas Marmat: కుప్పంలో ప్రతిగ్రామానికి ఇ-ఆటోలు

Andhra Pradesh Secretariat Breaking News latest news Security System Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.