ఈ రోజు విచారణకు హాజరుకాని విజయసాయి
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఈ రోజు సిట్ విచారణ(Sit enquiry)కు హాజరుకావాల్సి ఉంది. అయితే, తాను హాజరుకాలేనని ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఇతర ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా విచారణకు రావలేకపోయానని పేర్కొన్నారు. వచ్చే తేదీని త్వరలో తెలియజేస్తానని అధికారులను వివరించారు.
ఏప్రిల్ 18న విచారణకు హాజరైన విజయసాయి
విజయసాయి ఇప్పటికే ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరయ్యారు.
అప్పట్లో ఆయన కుంభకోణంలో కీలక పాత్రధారుల వివరాలు అందించినట్టు సమాచారం.
ఇప్పటివరకు అరెస్ట్ అయినవారు
ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది.
వారంతా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు.
భగవద్గీత శ్లోకంతో వైరల్ అయిన ట్వీట్
విచారణకు హాజరుకాలేదన్న వార్తల నేపథ్యంలో విజయసాయి తన ట్విట్టర్లో భగవద్గీత శ్లోకం షేర్ చేశారు. “ఎవరైతే కర్మ చేస్తారో వారు ఫలితాన్ని అనుభవించక తప్పదు” అనే అర్థమున్న ఈ ట్వీట్ వైరల్గా మారింది.
ఈ ట్వీట్పై వివిధ రాజకీయ వర్గాలు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు .
విజయ సాయి రెడ్డి అర్హత ఏమిటి?
ఆయన చెన్నైలో చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసి 22 సంవత్సరాలకు పైగా అనుభవంతో ప్రాక్టీస్లో ఉన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు తమిళనాడులోని ఇతర నగరాల్లో కార్యాలయాలతో ఉన్న మెస్సర్స్ వి ఎస్ రెడ్డి ఎస్పీ & అసోసియేట్స్లో ఆయన సీనియర్ మోస్ట్ భాగస్వామి.
Read hindi news: hindi.vaartha.com
Read also: TG PECT: 23 నుంచి పిఇసెట్-2025 కౌన్సెలింగ్