Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను ఎపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆ డెయిరి తెలంగాణ ఛైర్మన్ గుత్తా ఆమిత్ రెడ్డి మండి పడ్డారు. ఏపి ఫెడరేషన్ ఫ్రాంచైజ్ పంపిణీచేస్తోన్న నెయ్యి వెజిటెబుల్ ఆయిల్ అని స్పష్టం చేశారు. ఏపి ఫెడరేషన్ తెస్తున్న నెయ్యిని ఎన్ఐబికి తాము టెస్టు చేయించామని, కల్తీ జరిగినట్టు రిపోర్టులో వచ్చిందని సంచనల అంశాలను బయటపెట్టారు. ఈ అంశంపై ఏపి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ విజయ డెయిరి పూర్తిగా సహకార రంగంలో పనిచేస్తూ రైతుల నుండి పాలను సేకరించి నెయ్యితోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రజలకు విక్రయిస్తోందన్నారు. అయితే ఏపి ఫెడరేషన్ మాత్రం పేరుకే విజయ డెయిరి బ్రాండ్కింద ఉందని, మ్యాక్స్ చట్టం కింద అక్కడి డెయిరి జిల్లా ఫెడరేషన్లుగా విడిపోయిందన్నారు. అలా ఏపిలో విజయ బ్రాండ్తో వ్యాపారం చేసుకు నేందుకు కొంతమంది ప్రయివేటు వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చిందన్నారు.
Read Also: AP TG education issue : తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు
ఫలితంగా ఈ మధ్యకాలంలో మేఘనాఫుడ్స్ సంస్థతోపాటు మేఘనాథ్ రెడ్డి అనే వ్యక్తి విజయ ఫుడ్స్ పేరుతో ఏపి నుంచి ఫ్రాంచైజ్ అనుమతి పొంది తెలంగాణలో విక్రయాలు కొనసాగిస్తు న్నారని వివరించారు. వారికి రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధం లేదని, పాల సేకరణ చేయడం లేదని, గుజరాత్లోని ఓ ఫ్యాక్టరీలో తయారు చేసిన నకిలీ నెయ్యిని తెలంగాణలో విజయ బ్రాండ్ పేరుతో ప్రతి నెలా 100 టన్నుల మేర అమ్ముతున్నారని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు
కల్తీపాలు, నెయ్యి తో (Ghee) ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఎపి డెయిరి పాలప్యాకెట్ మీద వివరాలను స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీ డిటెయిల్స్ వస్తున్నాయన్నారు. డెయిరి ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు/సంస్థలు విజయ డెయిరి పేరు వాడుకోవడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఏపీ డెయిరికి లేఖలు రాసినా స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరి రైతులకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు విజయ బ్రాండ్ పేరును చూసి కొనుగోలు చేయాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: