Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

Read Time:  1 min
Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ
FONT SIZE
GET APP

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. కల్తీ జరిగిందని చెబుతున్న సమయం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతేనని ఆమె ఆధారాలతో సహా ప్రశ్నించారు. జూలై 2024లో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని ఆమె ఆరోపించారు. నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ టిటిడిలో పటిష్టంగా ఉన్నప్పుడు, అపనిందలు గత ప్రభుత్వంపై వేయడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె మండిపడ్డారు.

Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

విడదల రజిని తన ట్వీట్‌లో కొన్ని కీలక తేదీలను ప్రస్తావించారు. 2024 జూలై 6న వచ్చిన రెండు ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ ల్యాబ్ పరీక్షించి, అవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చడం వాస్తవం కాదా అని నిలదీశారు. నాణ్యత లేదని వెనక్కి పంపిన ట్యాంకర్లు, మళ్లీ దొడ్డిదారిన లోపలికి వచ్చాయంటే అది ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె విమర్శించారు. “ఒకవేళ నెయ్యి కల్తీ అని మీరు నమ్మితే.. ఆ కల్తీ నెయ్యి సరఫరా అయింది మీ పాలనలోనే కదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి” అంటూ ఆమె చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి రజని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు

ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సింది పోయి, ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని రజిని ఆరోపించారు. టీటీడీ ల్యాబ్ నివేదికలు మరియు ట్యాంకర్ల రాకపోకల డేటాను పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు జరుగుతున్న ప్రచారమంతా వైఎస్సార్‌సీపీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కల్తీ నెయ్యి వివాదంపై ప్రభుత్వం ఇచ్చే వివరణ కోసం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.