ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీ(Victory Rally)లను నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సూచించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు ఘనంగా నిర్వహించాలంటూ కూటమి నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈరోజు సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
అదే రోజు సాయంత్రం 5 గంటలకు అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమీక్షలో గత ఏడాది పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చ జరగనుంది. పాలనలో ప్రజల అభ్యున్నతికి తీసుకున్న చర్యలను విశ్లేషించడమే కాకుండా, వచ్చే సంవత్సరాల్లో ఆచరించవలసిన దిశలను కూడా ఈ సమావేశంలో నిర్ధారించనున్నారు.
గత ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేయాలి
ఈ విజయోత్సవ ర్యాలీల ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అరాచకాలను ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. అందువల్ల ఈ ర్యాలీలు కేవలం విజయోత్సవంగా కాక, భవిష్యత్తు కార్యాచరణకు బలమైన మద్దతుగా ఉండేలా చేయాలన్నారు.
Read Also : Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇకలేరు