📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

రెండు నెలల గడువు కోరిన వర్మ

Author Icon By Sharanya
Updated: February 12, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు:

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఇవాళ ఆయన సీఐడీకి ఝలక్ ఇచ్చారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపగా ఆయన విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో తన లాయర్ ను పంపి కారణం చెప్పించారు. అలాగే తన హాజరుకు రెండు నెలలు గడువు కూడా కోరారు. దీంతో సీఐడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

యాక్ట్‌కి కారణమైన కేసు వివరాలు:

గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ పై వ్యూహం పేరుతో సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరుకాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు ఆర్జీవీ. ఈనెల 4న విచారణకు రావాలని పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా ఈనెల 7న విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ దాదాపు 12 గంటలకు పైగా విచారణ జరిపారు. ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఉండటంతో విచారించి వదిలిపెట్టారు. అదే సమయంలో వర్మకు సీఐడీ నోటీసులు పంపింది. ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన చిత్రంలో ఉద్రేకపూరిత చిత్రాలను తొలగిచలేదని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు దింతో రాంగోపాల్ వర్మ ఫై మంగళగిరి సీఐడీ పోలీస్ స్టెయిన్ లో గత ఏడాది నవంబర్ 29 న కేసు నమోదైంది. ఈ కేసు లో రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు.ఇటీవల ఒంగోలు లో సీఐడీ అధికారులు రాంగోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చి సోమవారం విచారణకు రమ్మన్నారు.

రాంగోపాల్ వర్మ స్పందన:
గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. దీంతో ఇవాళ వర్మ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ సమాచారం ఇచ్చారు.

ఆర్జీవీ అడ్వకేట్ ఏమన్నారంటే:

తన లాయర్ ను సీఐడీ ఆఫీసుకు పంపి ఏకంగా 8 వారాల సమయం కావాలని లిఖిత పూర్వకంగా సీఐడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకుబోతున్నారు. సీఐడీ విచారణకు హాజరు కాని వర్మను అరెస్టు చేయొద్దనే ఆదేశాలు లేనందున అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.

AndhraPradesh Breaking News in Telugu Chandrababu cid action Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pawan Kalyan RamGopalVarma Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.