Mohan ranga daughter : దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాలత తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి స్పష్టత ఇచ్చారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె ఖండించారు. మార్కాపురం జిల్లా కంభం చెరువును సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఇవన్నీ కేవలం దుష్ప్రచారమని పేర్కొన్నారు.
కొంతకాలంగా తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జరుగుతున్నాయని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆశాలత తెలిపారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాధా–రంగా మిత్రమండలిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సంస్థను మరింత బలోపేతం చేయడమేనని చెప్పారు.
Read Also: UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య
రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు ఉన్నప్పటికీ, తక్షణ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు సాగుతానని తెలిపారు. ఆమె సోదరుడు వంగవీటి రాధా ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉండగా, ఆశాలత కూడా ప్రజల్లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: