Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో మానవీయ కోణంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. సోమవారం శాసనసభలో జైళ్లు, సంస్కరణల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జైలులో ఉన్న మహిళా ఖైదీల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి కోసం జైలు ప్రాంగణాల్లోనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల ఆ చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందుతుందని ఆమె పేర్కొన్నారు.
Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
ఖైదీల చదువు, క్రమశిక్షణపై దృష్టి
జైలులో ఉండే ఖైదీలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. జైళ్లల్లో సంస్కరణల కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మేరకు ఏపీలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వంగలపూడి అనిత వివరించారు.

మరోవైపు జైళ్లల్లోని ఖైదీలలో పరివర్తన తెచ్చేందుకు చట్టంలో కొన్ని మార్పులు తేవాలని అనిత అభిప్రాయపడ్డారు. ఖైదీల నేరచరిత్ర, వారి ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని వెల్లడించారు. ఖైదీల మానసిక పరివర్తన కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటుచేస్తామని.. వ్యవసాయం, ఇతర వృత్తులు నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపడతామని హోం మంత్రి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: