పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు (Polavaram-Banakacherla Project) రాయలసీమ ప్రాంతానికి నిత్య సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడినదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్లిపోతున్న గోదావరి జలాలను ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించి కరవు తీవ్రతను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరుగదని, పూర్తిగా అదనపు నీటి వినియోగమే జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఘాటుగా స్పందించిన నిమ్మల
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల తెలంగాణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు లేకుండానే కాళేశ్వరం, సీతారామ వంటి ప్రాజెక్టులను నిర్మించిన వాస్తవాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులన్నీ అనుమతులు లేకుండానే నిర్మించబడ్డాయని, వాటి వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందన్న ఆరోపణలు ఉన్నా తాము ఎప్పటికీ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ధోరణిలో లేమన్నారు. ఒకరిపై ఆరోపణలు చేయడంకంటే ప్రజలకు మేలు చేసే దిశగా ప్రాజెక్టులను నెరవేర్చడం ముఖ్యమని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై కేంద్రానికి నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నదని, ఇప్పటికే కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు అన్ని వివరాలతో నివేదికలు పంపించినట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ రైతులకు సాగునీరు అందుతుందని, మల్టీపర్పస్ ప్రయోజనాలతో రాష్ట్రానికి ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Retro: సిరీస్గా రాబోతున్న సూర్య ‘రెట్రో’