కేంద్ర(UPSC Jobs 2025 Alert) ప్రభుత్వ ఆధీనంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో, 100 ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ & జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పోస్టులు, 2 డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టులు ఉన్నాయి.
Read also :కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ
ఈ పోస్టుల(UPSC Jobs 2025 Alert) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సంబంధిత రంగాలలో డిగ్రీ లేదా పీజీ/డిప్లొమా/పీహెచ్డీ ఉన్నవి కావాలి. హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్,(Engineering) టెక్నాలజీ, లా, మేనేజ్మెంట్, ఫైనాన్స్, అకౌంట్స్ వంటి విభాగాలలో విద్యార్హత ఉండాలి. అలాగే, సంబంధిత పనిలో అనుభవం కూడా అవసరం. అభ్యర్థుల వయోపరిమితి 30 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. డిసెంబరు 13వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2026 జనవరి 1వ తేదీ. జనరల్ అభ్యర్థులకు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టుల నియామకం నిమిత్తం ఎలాంటి రాత పరీక్ష జరపకుండానే, విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :