📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Udbhav 2025: డిసెంబర్ 3,4,5 తేదీల్లో ఉద్భవ్: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Author Icon By Rajitha
Updated: November 26, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummadi sandhya rani) ఏపీలో తొలిసారిగా గిరిజన చిన్నారులకు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధమవుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఏపీ ఏకలవ్య మోడల్ ఐ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించడానికి సమాయత్త మవుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఆమోదించారు. ఉద్భవ్ 2025 పేరుతో నిర్వహించనున్న ఈ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలలో ప్రతిభ చాటేందుకు 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 1644 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

Read also: Women’s rights : మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

Minister Gummidi Sandhyarani

ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయంలో

విద్యార్థులతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, కంటింజెంట్ మేనేజర్స్ మరో 278 మంది హాజరవుతున్నారు. దేశంలోని సాంస్కృతిక, కళా వైవిధ్యం మరియు గిరిజనుల జీవిత ముఖచిత్రాలను ప్రతిబింబించే సంగీతం, సాహిత్యం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేయనుంది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సన్నాహకాల వివరాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం కార్యదర్శి ఎం. గౌతమి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి విలేఖరుల సమావేశంలో వివరించారు. ఉద్భవ్2025లో పాల్గొనేందుకు వచ్చే వారికి సదుపాయాల్లో లోటుపాట్లు తలెత్తకుండా రవాణా, వసతి, భోజన ఏర్పాట్లు ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయంలో ఇనుమడింపజేసేలా పోటీలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఉద్భవ్2025 పోస్టర్, లోగోను మంత్రివర్యులు ఆవిష్కరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

EMRS Festival latest news Telugu News tribal culture Udbhav2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.