📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: Udbhav 2025: జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గిరిజన విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీయడమే ఉద్దేశంగా నిర్వహిస్తోన్న ఉద్భవ్ 2025 (Udbhav 2025) సాంస్కృతిక ఉత్సవాలలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. కేఎల్ యూనివర్శిటీ వద్ద చిన్నారులు ప్రదర్శించే కళలతో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు నిర్వహించిన పోటీల ఫలితాలలో త్రిపుర, సిక్కిం, ఏపీ, ఒడిశా రాష్ట్రాల హవా సాగింది. రెండో రోజు నిర్వహించిన క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీలలో విద్యార్థులు మెరిశారు. రెండో రోజు మొత్తం 22 కవిభాగాలలో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

Tribal students shine at the national level

సాంస్కృతిక ఉత్సవాల్లో చిన్నారుల సందడి

ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 4.30 గం.ల వరకు పోటీలు నిర్వహించారు. ఇప్పటికే పలు కవిభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడించారు. ప్రధాన వేదిక కృష్ణ జింక వద్ద జరుగుతున్న డ్రామా పోటీలను వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. జాస్మిన్ హాల్(Jasmine Hall) వద్ద జరుగుతున్న శాస్త్రీయ సంగీత, నృత్య పోటీల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ప్రాంతీయ జానపద బృంద
నృత్యం, దేశభక్తి బృందగానం, గిరిజన సంప్రదాయ నృత్యం, కథ చెప్పడం, సృజన రచన, చిత్రలేఖనం వంటి పోటీలలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు.

11 పతకాలతో ఐదవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉద్భవ్ 2025(Udbhav 2025) ఉత్సవాలలో తొలి రెండు రోజులు కలిపి మొత్తం 46 ఈవెంట్లలో ఇప్పటివరకు 29 ఈవెంట్లు పూర్తయ్యాయి. అత్యధికంగా 22 పతకాలు సాధించి ఒడిషా రాష్ట్రం తొలి స్థానంలో సాధించింది. తెలంగాణ రాష్ట్రం 20 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 16 పతకాలతో సిక్కిం 16, 13 పతకాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. 11 పతకాలతో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. అయితే, శాస్త్రీయ సంగీతం, ఆశుకవిత్వం విభాగాలలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసిడి పతకం దక్కింది. దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఆశుకవిత్వం ఇంగ్లీష్ సీనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం దక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP Medals Cultural Competitions EMRS Students KL University Odisha Medals Tribal Students Festival Udbhav 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.