📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

యువగళానికి రెండేళ్లు..టీడీపీలో సంబరాలు

Author Icon By Sudheer
Updated: January 27, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నారా లోకేశ్‌ నాయకత్వంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

yuvagalam2yrs celebrations

2018లో చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 226 రోజుల పాటు కొనసాగి, 3,132 కిలోమీటర్లు నడవడంతో విశాఖపట్నం అగనంపూడిలో విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర సందర్భంగా ఎదురైన ఆటంకాలు, కేసులు, దాడులని అధిగమిస్తూ నారా లోకేశ్‌ తన అంకితభావాన్ని నిరూపించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారు. పాదయాత్ర సఫలమై, ప్రజలు నారా లోకేశ్‌ నేతృత్వాన్ని బలంగా ఆదరించారని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, రైతులు, బడుగు వర్గాల అభివృద్ధికి లోకేశ్‌ పాటుపడుతున్నారని, ఈ యాత్ర ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని నేతలు కొనియాడారు.

అభివృద్ధి, సామాజిక సమానత లక్ష్యంగా లోకేశ్‌ ముందుకు సాగుతున్నారని, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి కేంద్రంగా మార్చడానికి ఆయన ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రాంగోపాల్ రెడ్డి, ఫైబర్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల విజయోత్సవ సందర్భంగా యువగళం పాదయాత్ర రాష్ట్రానికి ఓ నూతన శక్తి అందించిందని, టీడీపీ భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.

Nara Lokesh yuvagalam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.