📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: fever-విషజ్వరాలతో విలవిల ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు మహిళలు మృతి

Author Icon By Pooja
Updated: September 12, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

fever-డయేరియా, విష జ్వారాలతో ఎన్టిఆర్ జిల్లాలో(NTR district) ఇద్దరు మహిళలు మరణించారు. విజయవాడలో డయేరియా ప్రబలి ఒకరు మరణించారు, సుమారు 50 మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విరోచనాలు, వాంతులతో బాధపడుతున్న విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన శ్రీరామ నాగమణి (61) ప్రభుత్వాస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. అతిసార బారిన పడిన సుమారు 50 మంది వరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రి, వివిధ అర్బన్ హెల్త్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

కలెక్టర్ చర్యలు

రాజరాజేశ్వరి పేటలో నమోదు ప్రబలుతున్న డయేరియా కేసుల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పలు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 41 మందికి చికిత్స అందిస్తున్నామని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చికిత్స తీసుకొని ఆరోగ్యం మెరుగుపడటంతో ఇప్పటి వరకు 22 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్ పేటలో 24 గంటల పాటు సేవలు అందించే విధంగా వైద్య శిబిరాన్ని(Medical camp) ఏర్పాటు చేశామని తెలిపారు.

తాగునీటి సరఫరా మరియు కంట్రోల్ రూమ్

ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో 91549 70454తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు.పరిస్థితి చక్కదిద్దేందుకు, సమన్వయానికి రెవెన్యూ,(Revenue) వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలు ఆర్ఆర్ పేటలో ప్రతి ఇంటినీ పర్యవేక్షిస్తున్నాయన్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.

తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షలకు పంపామని, ముందు జాగ్రత్తగా న్యూ రాజరాజేశ్వరి పేటలో కుళాయి నీటి సరఫరాను ఆపేసి ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ మృతికి, అతిసార ఘటనకూ ఎటువంటి సంబంధంలేదన్నారు.నందిగామ పట్టణంలో విష జ్వరంతో సముద్రాల మహి (22) అనే మహిళ మృతిచెందారు. రెండు రోజుల క్రితం మంగళగిరి ఎయిమ్స్ లో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని మహిళలు మృతిచెందారు?
ఇద్దరు మహిళలు మృతిచెందారు.

డయేరియా కేసులు ఎక్కువగా ఎక్కడ ప్రబలుతున్నాయి?
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో.

Read Hindi News: hindi.vaartha.com

Read also: Bharat-ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పురోగమనంలో పారిశ్రామిక అభివృద్ధి

Breaking News in Telugu diarrhea Google News in Telugu Latest News in Telugu New Rajarajeswari Pet ntr district Vijayawada Vishajvaralu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.