ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాత సుఖీభవ – PM కిసాన్’ (Annadata sukhibhava – PM Kisan)పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు. ఆగస్టు 2న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల రూపంలో రూ.14,000 సాయం ఇవ్వనున్నారు. ఇదివరకే అందుకున్న రైతులకు మాత్రం రెండో విడతగా రూ.7,000 జమ కానుంది.
ప్రకాశం జిల్లాలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ సంక్షేమ కార్యక్రమానికి మొత్తం రూ.3,156 కోట్లు కేటాయించారు. రైతుల భవిష్యత్తుకు బలమివ్వాలన్న లక్ష్యంతో ఈ సాయం అందించబడుతోంది.
కౌలు రైతులపై ప్రత్యేక శ్రద్ధ
ఈసారి ప్రత్యేకంగా కౌలు రైతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీరికి ఇంతకుముందు చాలా పథకాల్లో అర్హత లభించకపోయినా, ఈ పథకంలో మాత్రం వారికి డబుల్ సాయం అందించడం గొప్ప నిర్ణయంగా భావించబడుతోంది. ఈ విధంగా రైతుల భాద్యత తీసుకుంటూ, వారికోసం ప్రత్యక్ష మద్దతు కల్పిస్తున్న ఈ పథకం, వ్యవసాయ రంగానికి అండగా నిలిచేలా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులు ఏదైనా సాధించాలంటే ప్రభుత్వం భరోసా ఇస్తుందన్న నమ్మకాన్ని ఈ పథకం కలిగిస్తోంది.
Read Also : Polavaram Project : నేడు పోలవరం ప్రాజెక్టుపై మోదీ సమీక్ష