Telugu News: TTD: పరకామణి కేసు రాజీలో సూత్రధారులెవరు?

Read Time:  1 min
TTD
TTD
FONT SIZE
GET APP

తిరుమల: శ్రీవారి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు కేంద్రం పరకామణి భవనంలో 2023 ఏప్రిల్‌లో జరిగిన విదేశీ కరెన్సీ(Currency) చోరీ కేసులో తదనంతరం పరిణామాలపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు అసలు సూత్రధారులెవరనేది గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో కుట్రదారులు ఎవరనేది దాదాపుగా సీఐడీ నిగ్గుతేల్చేసింది.

Read Also: Vizag meeting: సిఐఐ సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు

TTD

సిఐడి విచారణ: కీలక వ్యక్తులపై దృష్టి

గత వారం రోజులుగా తిరుపతి (TTD) పద్మావతి విశ్రాంతి గృహంలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది. అనుమానాస్పదంగా మృతి చెందిన మాజీ ఏవీఎస్ సతీశ్ కుమార్, మరో ఇద్దరు సీఐలు, ఇద్దరు విజిఓలు, ఓ ఎస్సై, పరకామణి డిప్యూటీ ఈఓ, సూపరింటెండెంట్, ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులను విచారించి ఆధారాలు రాబట్టారు. తాజాగా, శుక్రవారం సీఐ జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, మాజీ విజిఓ బాలిరెడ్డి, ఎస్ఐని అన్ని కోణాల్లో విచారణ చేశారు. గత బోర్డులోని పెద్దలు, టీటీడీ అధికారి ఆదేశాలతోనే ఇలా చేయాల్సి వచ్చిందని క్లైమాక్స్ వెల్లడైందనేది సమాచారం.

తదుపరి విచారణ, హైకోర్టు నిర్ణయంపై ఆసక్తి

  • విచారణ పరిధి: దొంగిలించిన నిందితుడు రవికుమార్ నుంచి రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇప్పించాలని ఎందుకు అనుకున్నారు? ఎవరు ఆదేశించారనేది ఇప్పుడు కీలకంగా విచారణలో ఉంది.
  • కీలక వ్యక్తులు: తదుపరి విచారణ కోసం గత టీటీడీ మాజీ సీవీఎస్‌ఓ నరసింహ కిశోర్‌, టీటీడీ మాజీ అధికారిణి, మాజీ ఛైర్మన్‌ను కూడా విచారణ చేయించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసుకుంటోంది.
  • న్యాయపరమైన పరిణామాలు: ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిల్ (PIL), పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేయనుండటంతో, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. చోరీపై చట్టపరమైన దర్యాప్తు సరిగా జరిగిందా లేదా అనే విషయంపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.