TTD: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు

Read Time:  1 min
TTD: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు
FONT SIZE
GET APP

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో గత నెల డిసెంబర్ 30న ప్రారంభమైన పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు (నేటి) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసిన టీటీడీ (TTD), మిగిలిన ఏడు రోజులకు నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. పరిమిత సంఖ్యలో శ్రీవాణి, రూ.300 టికెట్లు, వీవీఐపీల బ్రేక్, స్థానికులకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు జారీ చేశారు.

Read Also: Andhra Pradesh: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం

TTD: Vaikunthadwara darshans to end today in Tirumala
TTD: Vaikunthadwara darshans to end today in Tirumala

పకడ్బందీగా ఏర్పాట్లు

నిన్న ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, నేడు కూడా అదే స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. ఏఐ (Al) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ,

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేశారు. భక్తుల భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.