TTD: మార్కెటింగ్, కొనుగోళ్ల విభాగం అధికారుల నుండి సిట్ కీలక సమాచారం తిరుమల (Tirumala) : దేవుని లడ్డూల తయారీలో 2020 నుండి 2024వ సంవత్సరంవరకు కల్తీనెయ్యి సరఫరా జరిగిన కేసులో కీలకంగా గత టిటిడి బోర్డు పెద్దలే ఉన్నారనేది సిబిఐ సిట్ అధికారులు రాబట్టిన సమాచారం. ఈ కేసులో టిటిడి మార్కెటింగ్ విభాగం, కొనుగోళ్ల కమిటీలో అధికారుల నుండి సిట్ రాబట్టిన సమాచారంతో ఇప్పుడు ఇటీవల సిట్ అరెస్ట్ చేసిన చిన్న అప్పన్న, అజయ్ కుమార్లను కస్టడీకి తీసుకునేందుకు ఎసిబి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఎసిబి న్యాయమూర్తి కస్టడీకి అప్పగిస్తే తదుపరి ఎవరి పేర్లు బయటకు రానున్నాయనేది తెలిసినా సిట్ అధికారికంగా స్పష్టతనీయలేదు. ఇప్పటికే కల్తీనెయ్యిలో గత బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సమర్పించాలని సిట్ ఆదేశించింది.
Read also: AP: కొత్త ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పండి: మంత్రి లోకేష్
కల్తీనెయ్యిలో కీలకం గత టిటిడి బోర్డు పెద్దలే!
నాణ్యతలేని నెయ్యి సరఫరా చేయడం వెనుక
TTD: మరీ న్యాయమూర్తి ఆదేశాలతో తదుపరి సిట్ చర్యలకు సిద్ధమవుతోంది. కల్తీనెయ్యి సరఫరా చేసిన బాగోతంలో రానున్న రోజుల్లో కీలకంగా వ్యవహరించిన కొందరు సూత్రధారులతోబాటు టిటిడి అధికారుల పాత్రను తేల్చేయనుంది. గతంలోనే టిటిడికి తిరుమల లడ్డూలకు అవసరమైన నెయ్యి సరఫరాకు టెండర్లు పిలవడం, టెండర్లలో పాల్గోన్న డెయిరీ సంస్థల యాజమాన్యం టిటిడి నిబంధనలు ఉల్లంఘించి నాణ్యతలేని నెయ్యి సరఫరా చేయడం వెనుక కీలక వ్యక్తులు పట్టుకోవడం సిట్కు సాహసంతో కూడిన విషయం. గత టిటిడి బోర్డు పెద్దలు, మాజీ అధికారుల అరెస్ట్ తప్పదనేది తెలుస్తోంది. ఈ వారంలో సిట్ దర్యాప్తు, ఎవరిని పిలిచి అరెస్ట్ చేయనుందనేది టిటిడిలో హాట్లాఫిక్గా మారింది. కల్తీనెయ్యి సరఫరాచేసిన పాపంలో అసలు సూత్రధారులైన గత టిటిడి పెద్దల అవీనీతిగుట్టు రట్టయ్యే అవకాశం కూడా ఉండటంతో సిబిఐ సిట్ అధికారులు అన్ని కోణాల్లో కార్యాచరణ సిద్ధం చేసుకొంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: