TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh ambani) మరోసారి తన దాతృత్వాన్ని చూపించారు. ఆదివారం ఆయన ఒక్కరోజులోనే మూడు ప్రధాన ఆలయాలను సందర్శించి, రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించారు. తిరుమలలో అన్నప్రసాదం ట్రస్టు కోసం రూ.100 కోట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో ప్రతి రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే ఆధునిక వంటశాలను నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
Read also: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

TTD: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు
తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును
TTD: తర్వాత ఆయన రాజస్థాన్లోని నాథ్ద్వారా ఆలయాన్ని సందర్శించి, భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయ నిర్మాణానికి రూ.50 కోట్లకు పైగా విరాళం ప్రకటించారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును అందజేశారు. అనంతరం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి, దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.15 కోట్ల మొదటి విడత విరాళం అందజేశారు. ఒకే రోజులో మూడు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలకు విరాళాలు ప్రకటించిన అంబానీ చర్య సామాజిక వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
తిరుమల ఆలయానికి అంబానీ ఎంత విరాళం ఇచ్చారు?
తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు.
గురువాయూర్ ఆలయానికి ఆయన విరాళం ఎందుకు ఇచ్చారు?
గురువాయూర్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం తొలి విడతగా రూ.15 కోట్ల విరాళం ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: