📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

TTD: కపిలతీర్థంలో పిండ ప్రధానం పై అర్చకుల ఆందోళన

Author Icon By Rajitha
Updated: January 6, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి కపిలతీర్థంలో (Kapila Theertham) పిండ ప్రధానం కార్యక్రమానికి టీటీడీ అనుమతి నిరాకరించిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ తెలిపింది. కపిలతీర్థం మెయిన్ గేట్ లోపల పిండ ప్రధానం నిర్వహించేందుకు కోరుతున్న స్థలం టీటీడీ పరిధిలోకి రాదని, అది అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ప్రాంతమని వెల్లడించింది. తమ పరిధిలో లేని స్థలానికి అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని టీటీడీ ప్రశ్నించింది.

Read also: Tirupati Crime : మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Priests protest against performing Pinda Pradanam at Kapilatheertham

తప్పుడు ప్రచారంతో భక్తులు గందరగోళానికి గురికాకూడదని

టీటీడీ అనుమతి ఇవ్వలేదని అర్చకులు రోడ్డుపై పిండ ప్రధానం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి టీటీడీ సెక్యూరిటీ అడ్డుకుంటోందన్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. టీటీడీకి సంబంధించిన ఏ సమాచారం అయినా అధికారిక వెబ్‌సైట్, పత్రికా ప్రకటనలు లేదా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెలువడుతుందని గుర్తుచేసింది. తప్పుడు ప్రచారంతో భక్తులు గందరగోళానికి గురికాకూడదని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడు వాహనాలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యప్రభ, హంస, అశ్వ, గరుడ, చిన్నశేష, చంద్రప్రభ, గజ వాహనాలపై ఊరేగింపు జరుగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల సేవ, వేదాశీర్వచనం వంటి కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జనవరి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులకు సర్వదర్శనం ఉంటుందని వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kapila Theertham latest news pinda pradanam Telugu News tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.