తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాలో ఫార్మాస్యూటికల్ రంగంలో విశేష విజయాలు సాధించిన పారిశ్రామికవేత్త మంతెన రామలింగ రాజు(Ramalinga Raju) తాజాగా టీటీడీకి ₹9 కోట్లు(crores) దానం చేశారు. ఈ విరాళాన్ని ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై అందజేశారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విరాళాన్ని స్వీకరించారు.
Read Also: Tirumala: మూడురోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే ‘వైకుంఠ’దర్శన టోకెన్లు జారీ

టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ
టీటీడీ(TTD) చైర్మన్ మాట్లాడుతూ, పీఏసీ-1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం రామలింగ రాజు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో, మెరుగైన వసతుల కోసం ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది మంతెన రామలింగ రాజు ఇచ్చిన మొదటి విరాళం కాదు. గతంలోనూ, 2017లో, ఆయన 28 కిలోల బంగారంతో తయారు చేసిన సహస్రనామ మాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి పెద్ద పేరు పొందారు. ఆయన కుటుంబం తరతరాల నుంచి స్వామివారికి సేవ చేయడం పట్ల భక్తులు, నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: