📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: TTD: శ్రీవారికి 122 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన జైన మతస్థుడు

Author Icon By Sushmitha
Updated: December 9, 2025 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు, ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తిరుమలకు తరలివస్తారు, దర్శనం మరియు వసతి విషయంలో టీటీడీ కొత్త మార్పులను ప్రవేశపెట్టింది, AI (కృత్రిమ మేధస్సు) వినియోగంతో మరింత మెరుగైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తోంది, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ శక్తి కొద్దీ ముడుపులు చెల్లిస్తారు, మరికొంత మంది స్వామివారిపై ఉన్న విశ్వాసంతో భారీ విరాళాలు ఇస్తారు. ఈ నేపథ్యంలో, ఒక జైన మతస్థుడు శ్రీవారికి 122 కిలోల బంగారం కానుకగా సమర్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెల్లడించారు.

Read Also: AP: ఇంటికే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సీఎం చంద్రబాబు

TTD Jain devotee donates 122 kg of gold to Lord Shiva

ముఖ్యమంత్రి వెల్లడించిన జైన్ భక్తుడి కథ

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది, వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ (TTD) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది, శ్రీవారికి వచ్చిన కానుకల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర అంశాలు తెలిపారు, వేంకటేశ్వరస్వామి ఎంతో మహిమ గల దేవుడని, అందుకే ఒక జైన మతస్థుడు భక్తితో ఏకంగా 122 కిలోల బంగారం సమర్పించారని సీఎం వివరించారు.

ఇటీవల ఒక జైన మతస్థుడు తనను కలిసినప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నారని చంద్రబాబు చెప్పారు, ఆ భక్తుడు తన వ్యాపారంలో కొంత వాటాను విక్రయించగా 5 వేల కోట్ల రూపాయలు వచ్చాయని, దాంతో స్వామివారికి 122 కిలోల బంగారం ఇస్తానని మొక్కుకున్నట్లు తెలిపారన్నారు, మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వెళ్లి అధికారులను కలిసినప్పుడు, వారు శ్రీవారికి ప్రతిరోజూ 121 కిలోల బరువైన ఆభరణాలు అలంకరిస్తామని మాటల సందర్భంలో చెప్పారని చంద్రబాబు వివరించారు.

AI వినియోగం, లడ్డూ ప్రసాదం నాణ్యత

దీంతో, ఆ భక్తుడు 122 కిలోల బంగారం కానుకగా సమర్పించాలని స్వామివారే తనకు సందేశం పంపినట్లు భావించారని సీఎం చెప్పారు, స్వామివారికి అంత మహత్యం లేకపోతే ఒక భక్తుడు 122 కిలోల బంగారం ఇస్తారా, రోజు లక్ష మంది దర్శనం కోసం ఎందుకు వస్తారని ప్రశ్నిస్తూ, స్వామివారిపై భక్తుల నమ్మకం అలాంటిదని చంద్రబాబు అన్నారు.

ఇక, తిరుమలలో శ్రీవారి భక్తుల అన్న ప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లెడ పట్టడానికి AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు, బియ్యం లేదా ఇతర దినుసుల్లో ఏ అన్య పదార్థం వచ్చినా AI టెక్నాలజీతో (AI technology) గుర్తించి యంత్రం వాటిని ఏరివేస్తుందని చెప్పారు, అదేవిధంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి, దినుసులు వాడుతున్నామని, అన్నప్రసాదం నాణ్యతపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

122 kg gold 5000 crore AI technology in Tirumala CM Chandrababu naidu devotee faith gold donation Google News in Telugu Jain devotee Latest News in Telugu Telugu News Today Tirumala Venkateswara Swamy TTD services improvement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.