📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే

Author Icon By Rajitha
Updated: October 3, 2025 • 9:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల TTD భక్తులకు శుభవార్త.. పండగ ప్రత్యేక రైళ్లు సిద్ధం చేసిన రైల్వే దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 470 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయాణికులకు అనువుగా ఈ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

Dasara Holidays : ముగిసిన దసరా సెలవులు

TTD

తిరుపతి – షిర్డీ స్పెషల్

ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు (07637) నంబర్ రైలు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45కు సాయినగర్ షిర్డీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07638) రైలు ప్రతి సోమవారం రాత్రి 7:35కి షిర్డీలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 1:30కు తిరుపతికి చేరుతుంది.

తిరుపతి – జల్నా స్పెషల్
(07610) నంబర్ రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15కు తిరుపతి TTD నుంచి బయలుదేరి, తరువాతి రోజు మధ్యాహ్నం 3:50కు జల్నా చేరుతుంది. తిరుగు దారిలో (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్నా నుంచి ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 10:45కు తిరుపతికి చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

భారతీయ రైల్వే ఇప్పుడు ప్రత్యేక రైళ్లను ఎందుకు ప్రకటించింది?
దసరా, దీపావళి పండగల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి.

ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తాయి?
తిరుపతి నుంచి షిర్డీ, తిరుపతి నుంచి జల్నా వరకు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News latest news South Central Railway Telugu News tirumala special trains tirupati jalna train tirupati shirdi train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.