📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: భక్తులకు గుడ్ న్యూస్.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. అత్యాధునిక ఏఐ (Artificial Intelligence) సాంకేతికతను ఉపయోగించి భక్తులు కేవలం రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విధానం కోసం పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే అన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళిత వాడల్లో 5,000కు పైగా శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

Read also: Andhra Pradesh: టెక్స్‌టైల్ రంగంలో తొమ్మిది కంపెనీలు

TTD: భక్తులకు గుడ్ న్యూస్..

TTD: ఇక తిరుపతిలోని ఫ్లైవోవర్‌కు మునుపటి “శ్రీనివాస సేతు” అనే పేరును మార్చి తిరిగి “గరుడ వారధి”గా నిర్ణయించినట్లు నాయుడు తెలిపారు. అదనంగా, తిరుపతి విమానాశ్రయానికి “శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టు”గా నామకరణం చేయడానికి ఫైలు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు చెప్పారు. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల లీజులు రద్దు చేశామని, తిరుమల కింద 50 ఎకరాల్లో 25,000 మంది భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించే ప్రణాళిక ఉందని తెలిపారు. ఏడాది కాలంలో టీటీడీకి సుమారు రూ.1,000 కోట్ల విరాళాలు అందాయని, దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Darshan latest news Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.