📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: TTD ghee scam: తిరుమల నెయ్యి అక్రమాలు బయటపడ్డాయి..

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి లడ్డూ(TTD ghee scam) కోసం ఉపయోగించే నెయ్యి కొనుగోళ్లలో భారీ అపకారం బయటపడింది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ వ్యవహారంలో, గతంలో టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న ఆర్ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం(RSSVR Subramaniam) ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. అర్హతలేని పాల సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు ఆయన పెద్ద మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం అరెస్టులో ఉన్న సుబ్రహ్మణ్యం, టీటీడీలో ఈఈ హోదాలో పనిచేస్తున్నారు.

Read Also: Amaravati: అమరావతి భూ సమీకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Tirumala ghee irregularities exposed..

సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ

సిట్ విచారణ వివరాల ప్రకారం, 2021 జూలై నుంచి 2023 నవంబర్ వరకు సుబ్రహ్మణ్యం అనేకసార్లు లంచాలు తీసుకున్నారు. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డెయిరీల ప్రతినిధుల వద్దనుంచి రూ.3.50 లక్షలు నగదు, రూ.50 వేల విలువైన శాంసంగ్ ఫోన్, రూ.16,700 విలువైన వెండి తాళం, వెండి నాణేలు అందుకున్నట్లు బయటపడింది. ఈ డెయిరీల ఉత్పత్తి కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా, సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ వీటికి అర్హత ఉందని నివేదిక ఇచ్చినందున కాంట్రాక్టులు సులభంగా మంజూరు అయ్యాయి.

కుంభకోణంలో అత్యంత ఘోరమైన అంశం ఏమిటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు ల్యాబ్ నివేదిక స్పష్టంగా పేర్కొన్నా, సుబ్రహ్మణ్యం ఆ వివరాలను దాచిపెట్టడం. మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ(CFTRI) పరీక్షలో నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిపినట్లు తేలినా, ఈ నివేదికను పై అధికారులకు తెలియజేయకుండా కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించారు.

అంతకుముందు భోలేబాబా డెయిరీ అర్హతలేనిదని అదే సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఇచ్చి ఉండగా, ఆ తర్వాత అదే డెయిరీకి మళ్లీ నెయ్యి(TTD ghee scam) ఆర్డర్లు ఇవ్వడం ఆయన ప్రమేయాన్ని స్పష్టంగా చూపుతున్న విషయమని సిట్ భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధిత డెయిరీలకు కోట్ల రూపాయల లాభం చేరగా, భక్తుల నమ్మకంపై తీవ్రమైన ప్రభావం పడిందని దర్యాప్తు వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Adulterated Ghee Case sit investigation Subrahmanyam corruption Tirumala laddu ghee scam Tirupati News TTD scam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.