తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వినికిడి లోపం ఉన్న చిన్నారుల కోసం ఒక విశిష్టమైన సేవా కార్యక్రమం — ‘శ్రవణం’ — ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మాట వినలేని పిల్లలకు మాట్లాడటం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు నేర్పించడమే కాకుండా, వారికి ఆత్మవిశ్వాసం పెంచే దిశగా శిక్షణ అందిస్తున్నారు.
TTD: టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఇటీవల శ్రవణం సంస్థను సందర్శించి, పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. శిక్షణా విధానం, అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లలకు సమయానికి పాలు, టిఫిన్, భోజనం, తాగునీరు అందుతున్నాయా అనే అంశాలను తెలుసుకున్నారు. అలాగే, శిక్షణ ప్రారంభం తరువాత పిల్లల్లో మాటల ఉచ్చారణ, అర్థం చేసుకునే సామర్థ్యం ఎంత మేర మెరుగుపడిందో కూడా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈవో ఆధునిక బోధనా పద్ధతులను అవలంబించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆడియో, వీడియో, ఆటలు, పాటల ద్వారా పిల్లలు సులభంగా నేర్చుకునేలా చేయాలి అని తెలిపారు. తరగతి గదుల్లో ఆధునిక వసతులు ఏర్పాటు చేయడం, లైటింగ్, బోధనా పరికరాల కోసం అవసరమైన ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Also: Pak: చర్చలు ఫలించకపోతే ఇక యుద్ధమే..ఆసిఫ్
విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం
డే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం, శిక్షణ పూర్తయ్యాక ఆధునిక వినికిడి పరికరాల అందజేత, మెరుగైన పాఠ్యాంశాలు, బోధనా సామగ్రి, స్టేషనరీ వంటి అంశాలపై పూర్తి ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘శ్రవణం’ ప్రాజెక్టుకు టీటీడీ నిధులు కేటాయిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏటా అడ్మిషన్లు కొనసాగుతూనే ఉంటాయి. పిల్లల నుంచి ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా శిక్షణ ఇస్తారు. ప్రైవేట్ సంస్థల్లో ఇలాంటి కోర్సులకు వేలల్లో లేదా లక్షల్లో చెల్లించాల్సి వస్తే, టీటీడీ మాత్రం దీనిని సేవారూపంగా నిర్వహిస్తోంది.
ఇక్కడ స్పీచ్ థెరపీతో పాటు డ్రాయింగ్, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యా అంశాలు కూడా బోధిస్తున్నారు. ఈ శిక్షణ ఫలితంగా ఎంతో మంది పిల్లలు మాటలు మాట్లాడటం నేర్చుకుంటున్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగుని నింపుతున్న ఈ ‘శ్రవణం’ కార్యక్రమం పట్ల ప్రజలు, తల్లిదండ్రులు, వైద్య నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీటీడీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం నిజంగా ఒక మానవతా మిషన్గా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: