తిరుమల : కలియుగవైకుంఠం తిరుమలకొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణంపోసే ఔషధమొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో “దివ్యఔషధవనాన్ని” ఏర్పాటుచేయాలని టిటిడి నిర్ణయించింది. తిరుమలలో జిఎన్సి టోల్గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ విద్యఔషధవనం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సూచనలతో టిటిడి చైర్మన్ బిఆరా నాయుడు స్వయం నిర్ణయంతో టిటిడి ఇది. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరు. మామిళ్ళ వెంకయ్యచౌదరి ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 జనవరిలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచనున్నారు. భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసి 2026 చివరికి పూర్తి స్థాయిలో ఔషధవనాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు.
Read also: Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం

TTD
ఔషధమొక్కలను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేయడం
TTD: 4.25కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. అరుదైన, జీవవరిణామం ఉట్టిపడే శేషాచలం అడవుల్లో అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న ఉన్న జీవనాడి. దివ్యఔషధవనం ఏర్పాటుచేసేందుకు టిటిడి సంకల్పించింది. ఔషధమొక్కలను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. దీనిద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తొడ్పడనుంది. దక్షిణభారత దేశంలోనే ఈ తరహాలో రూపొందించనున్న ఔష ధవనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
భక్తి విజ్ఞానం ప్రకృతి సమ్మేళనం
తిరుమలలో టిటిడి ఏర్పాటుచేయనున్న దివ్య ఔషధవనంలో దేహ చికిత్సవనం, సుగంధ వనం, పవిత్రవనం, ప్రసాద వనం, పూజాద్రవ్య వనం, జీవరాశివనం, కల్పవృ క్షధామం. ఔషధకుండి, మూలికావనం, విశిష్టవృక్ష వనం, ఔషధమొక్కలు వంటి 13రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమేగాక ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: