TTD Panchangam 2026-27: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర (2026-27) పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ఎం.రవిచంద్రతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
Read Also: Tirumala : తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. TTD వార్నింగ్
అందరికీ అర్థమయ్యేలా రూపకల్పన
ఈ సందర్భంగా చైర్మన్ బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ.. ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏటా ఉగాది నాటికి పంచాంగాలను భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ నూతన పంచాంగాన్ని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ రచించగా, వైఖానసాగమ పండితులు ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు అందరికీ సులభంగా అర్థమయ్యేలా పరిష్కరించారు. ఇందులో రాశిఫలాలు, వివాహ సుముహూర్తాలు, వధూవర గుణమేళనం మరియు టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను పొందుపరిచారు.
TTD Panchangam 2026-27: ధర మరియు లభ్యత
- ధర: రూ. 75/- మాత్రమే.
- లభ్యత: తిరుమల, తిరుపతిలోని టీటీడీ పబ్లికేషన్ స్టాళ్లలో ఆదివారం (మార్చి 1) నుండి అందుబాటులో ఉంటుంది.
- ఇతర కేంద్రాలు: వచ్చే వారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డాక్టర్ ఎ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :