తిరుమల : తిరుమల విజన్ 2047 అమలులో భాగంగా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలలనుండేగాక విదేశాల నుండి విచ్చేస్తున్న భక్తులకు వసతి, దర్శన సదుపాయాలు మరింత సులభం చేయడానికి వీలుగా తిరుపతి (TTD) అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటుకు టిటిడి సిద్ధమైంది. సుమారు 15 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడే భక్తులకు వసతి సౌకర్యంతో బాటు దర్శన టిక్కెట్లు, టోకెన్లు జారీచేసే కౌంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు అన్ని సమకూర్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి, అధికారులు కూడా ముందుకు కదులుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలనుండి దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ లక్షమందివరకు భక్తులు వస్తున్నారు.
Read also: FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్
Base camp inaugurated at Alipiri!
భక్తుల రద్దీ తగ్గింపే లక్ష్యంగా టిటిడి కొత్త ప్రణాళిక
కొండపై 50వేలమంది భక్తులు రద్దీ పెరిగితే వైకుంఠమ్ 1,2 క్యూకాంప్లెక్స్ క్యూలైన్లు నిండిపోయి. వెలుపలకు క్యూలైన్లు విస్తరిస్తున్నాయి. విపరీతమైన రద్దీతో శ్రీవారి దర్శనానికి 20గంటల నుండి 30గంటల సమయం పడుతోంది. దీంతో రద్దీకి అనుగుణంగా టిటిడి కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు, నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తులు తిరుమలకు చేరుకుంటే వీలైనంత వరకు త్వరగా నాలుగైదు గంటల్లోనే దేవుని దర్శనం చేయించేలా సేవలను కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత ప్రారంభించాలని ఆలోచన ఉంది. ఇదే సమయంలో తిరుపతి అలిపిరిలో బేస్ క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల వసతి, దర్శన కౌంటర్లు అందుబాటులోకి తీసుకువస్తే సుమారు 30వేలమంది వరకు భక్తులు ఈ క్యాంప్లోనే ఉండేందుకు వీలుంటుంది.
వసతి, దర్శన కౌంటర్లతో సమగ్ర సదుపాయాలు
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన మౌళిక వసతులకు టిటిడికి అనుమతులు ఇచ్చింది. కొండపై రద్దీని నియంత్రించేందుకు వీలుగా అలిపిరిలో బేస్ క్యాంపు ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. సాదారణరోజుల్లోనే తిరుమలకు 80వేలమంది నుండి 90వేలమంది వరకు భక్తులు చేరుకుంటున్నారు. ఇక వారాంతం, ప్రత్యేక పర్వదినాల్లో, విశేషమైన ఉత్సవాల రోజుల్లో 1.50లక్షలమంది వరకు కూడా భక్తులు తిరుమలకు వస్తున్నారు. గత ఏడాది కాలంలో తిరుమలలో విజన్ 2047కి శ్రీకారంచుట్టేలా పనులు చేపట్టేందుకు ప్రస్తుత టిటిడి బోర్డు బిఆర్ నాయుడు, టిటిడి ఛైర్మన్ ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, సమన్వయంతో అలిపిరిపాతచెకోపోస్టు ప్రాంతంలో సమీప స్థలాలను సిఇ సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.
కొండపై రద్దీ నియంత్రణకు అలిపిరి బేస్ క్యాంప్ కీలకం
కలుపుకునిగానీ, దేవలోకా ప్రాంతంలోగానీ బేస్ క్యాంపు ఏర్పాటుకు స్థలాల పరిశీలన జరిగింది. బేస్ క్యాంపుతోనే యాత్రికులకు సకల సేవలు: ఇప్పటికే అలిపిరి వద్ద ఇందుకోసం స్థలాన్ని కూడా టిటిడి పరిశీలించింది. ప్రస్తుతం తిరుమలలో 7,790 గదులు, వెయ్యికి పైగా మఠాల్లోని గదులు, సముదాయాల్లో 7వేల వరకు లాకర్లు సదుపాయం ఉన్నాయి. వీటన్నిటిలో 40వేలమంది నుండి 50వేలమంది వరకు భక్తులకు వసతి పొందుతున్నారు. ఆపై భక్తులు కొండకు చేరుకున్నా ఆరుబయట, ఖాళీస్థలాల్లో, ఉద్యానవనాల్లో విశ్రాంతి తీసుకోవడం, తలదాచుకోవడం కనిపిస్తుంది. సామాన్యభక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: