TTD annaprasadam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ప్రాథమిక దశలో 60 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. భవిష్యత్తులో, తెలుగు రాష్ట్రాలపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులోని ఎంపికచేసిన ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ పథకం అమలు అయ్యే అవకాశముంది. దశలవారీగా, తమ ఆధీనంలోని మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా ఈ సేవ విస్తరించబడుతుంది.
Read Also: IRCTC: తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్ – ప్రత్యేక ఆఫర్!
స్థానిక ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం
రాబోయే ఏప్రిల్ నుండి, TTD ఆధ్వర్యంలోని అన్ని స్థానిక ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ప్రారంభించవచ్చు. మెనూలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. స్థానిక ఆలయాల్లో ప్రసాదం తయారీ, వితరణ కోసం ధార్మిక సంస్థలు, మఠాలకు అప్పగించడానికి TTD(Tirumala Tirupati Devasthanams) నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించేందుకు 1985 ఏప్రిల్ 6న TTD ప్రారంభమైంది. 1994 ఏప్రిల్ 1న, శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్గా దీన్ని కొనసాగించారు.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం
2011 జులై 7న, తిరుమలలో మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నిర్మించబడింది, ఇందులో అత్యాధునిక వసతులతో భక్తులకు అన్నప్రసాదం అందించబడుతోంది. నవంబర్ 15 నాటికి ఈ ట్రస్ట్లో రూ. 2,316 కోట్లు డిపాజిట్ చేయబడ్డాయి. వెంగమాంబ కేంద్రం తో పాటు రాంబగీచ బస్టాండు, AMC, CRO, PAC-1, PAC-2,4,5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1,2, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లలో కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతోంది.
తిరుమలలో సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుండి 1.90 లక్షల మంది, వారాంతాల్లో 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా, జనవరి 1, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, గరుడసేవ రోజుల్లో సగటున 2 లక్షల మందికి పైగా భక్తులు TTD అన్నప్రసాదాన్ని పొందుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: