📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 11, 2025 • 6:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు..

అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. త్వరలో టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు ఉండాలని సూచించారు.

ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని శాఖలు తమ సర్వర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరు అధికారుల తీరుతో ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని, అటువంటి అధికారులు తమ విధి నిర్వహణ తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా అధికారులు మరింత వేగంగా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటూ, సేవలను మరింత మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Ap CM chandrababu Google news railway services TTD whatsapp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.