తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు IPS., గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ J. వెంకటరావు (అడ్మిన్), శ్రీ K. రవిమనోహర ఆచారి (లా & ఆర్డర్) గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ P. రామకృష్ణచారి గారి నాయకత్వంలో తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.
ఈ డ్రైవ్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీ A. సంజీవ కుమార్, శ్రీ M. భాస్కర్ నాయక్, శ్రీ P. సుబ్బారామి రెడ్డి, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ప్రత్యేక చర్యలో మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా అధిక శబ్దాన్ని సృష్టించే సైలెన్సర్లు, హారన్స్ అమర్చిన వాహనాలపై కఠినంగా జరిమానాలు విధించబడ్డాయి.
ఇప్పటివరకు, 60 ద్విచక్ర వాహనాల అధిక శబ్ద సైలెన్సర్లు తొలగింపు మరియు 500 అధిక శబ్ద హారన్స్ లపై జరిమానా మరియు తొలగింపు, ఈ చర్యలు మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190(2) ప్రకారం తీసుకోబడినవి. వాహన యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి, శబ్ద కాలుష్యంతో ఏర్పడే ఆరోగ్య, పర్యావరణ సమస్యలు వివరించబడ్డాయి. చాలా మంది వాహనదారులు తమ పొరపాటును అంగీకరించి స్వచ్ఛందంగా హారన్స్, సైలెన్సర్లు అప్పగించారు.
Read Also : Road Accident: మియాపూర్లో స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి