📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati Zoo: బురద కుంటలో నుంచి ఏనుగును పైకి లాగిన అటవీశాఖ.. వైద్యశాలకు తరలింపు

Author Icon By Saritha
Updated: December 2, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి జూకు తరలింపు

చిత్తూరు : యాదమరి మండలం తెల్లరాళ్ళపల్లి పంచాయతీ గుడ్డివాని చెరువు బురద కుంటలో కూరుకు పోయిన(Tirupati Zoo) ఏనుగును ఎట్టకేలకు సోమవారం అటవీశాఖ, పోలీసు అధికారులు వెలుపలికి తీసుకువచ్చారు. ఏనుగు కాళ్ళకు తీవ్రంగా గాయాలు వుండటంతో ఏనుగుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం దానిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి జువాలజికల్ పార్కుకు(Tirupati Zoological Park) తరలించారు. యాదమరి మండలం తెల్లరాళ్ళపల్లి పంచాయతీ గుడ్డివాని చెరువు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుండేది. తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చిన ఏనుగు కాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఆ ఒంటరి ఏనుగు తెల్లరాళ్ళపల్లి పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో వున్న గుడ్డివానిచెరువులోకి వెళ్ళి బురదలో చిక్కుకొంది.

Read also: తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరుకండి

Forest department pulls elephant out of mud puddle, takes it to hospital

ఏనుగును రక్షించి తిరుపతికి తరలింపు

ఈ విషయంను ఆదివారం తెల్లవారుజాము గుర్తించిన స్థానికులు అటవీశాఖ(Tirupati Zoo) అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అటు తమిళనాడు రాష్ట్ర అటవీశాఖ అధికారులతో పాటు సిఎఫ్ యశోద ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాసులు, ఎఫ్తార్లు థామస్, పట్టాబిలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరి, యాదమరి ఎస్ఐ ఈశ్వర్యాదవ్, ఇతర అధికారులు ఆధ్వర్యంలో చెరువు బురద కుంటలో చిక్కుకున్న ఏనుగును ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుండి అటవీ, పోలీసు శాఖలు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయి. చెరువు ఊబిలో చిక్కిన ఏనుగును సురక్షితంగా సోమవారం బయటకు వచ్చింది. ఏనుగు బలంగా గాయపడి వుండటంతో ఏనుగు కాళ్ళకు ప్రథమచికిత్స దానిని తిరుపతి జువాలజిక్ పార్కుకు తరలించి అక్కడ చికిత్స చేయించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగు సురక్షితంగా చెరువు నుండి బయటపడటంతో పలమనేరు నుండి వచ్చిన రెండు కుంకీ ఏనుగులు వెనుతిరిగి వెళ్ళాయి. చెరువు నుండి బయటపడ్డ ఏనుగును వాహనంతో తీసుకుని తిరుపతికి అటవీశాఖ అధికారులు తరలించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Chittoor News Elephant Rescue Forest Department Injured Elephant Latest News in Telugu Mud Pond Rescue Tamil Nadu Elephant Tirupati Zoo Wildlife Rescue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.