జిల్లా యంత్రాంగంతో టిటిడి అదనపు వెంకయ్య చౌదరి, తిరుమల (Tirupati) : ఏడుకొండల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రోజుకు 2లక్షలమంది భక్తులు ఆలయ మాఢవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉంటారని, వారిందరికీ సకల సౌకర్యాలు కల్పించాలని టిటిడి TTD అదనపు 22 చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఆదేశించారు. భద్రత పరంగా, గ్యాలరీల్లోకి ప్రవేశించే సమయంలో ఇంకా పలు ప్రాంతాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు రియలైమామానిటరింగ్ చేయాలని సూచించారు. వీలైనంతవరకు యాత్రికులకు సురక్షితమైన ప్రజారవాణావ్యవస్థను వినియోగించుకోవాలని భక్తులకు ఆయన విజప్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీని క్రమబద్దీకరించడం, పార్కింగ్ అంశాలపై సోమవారం సాయంత్రం అన్నమయ్యభవనంలో తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, టిటిడి సివిఎసీ మురళీకృష్ణ, తిరుమల (Tirupati) అదనపుఎస్పీ రామకృష్ణ, డిఎస్పీDSP విజయశేఖర్ తో కలసి టిటిడి విజెలెన్స్, తిరుమల పోలీసు అధికారులతో టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి సమీక్షించారు.

Tirupati
435 బస్సులు నడస్తున్నాయని
మాఢవీదుల్లోని గ్యాలరీల్లో 1.80 లక్షలమంది నుండి 2లక్షలమంది వరకు భక్తులు వేచివుంటారన్నారు. వారందరికీ కూర్చునే సదుపాయం ఉందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఇఒ వెల్లడించారు. 4,200మంది పోలీసులు, 1,500మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ (Control system) ద్వారా రద్దీనియంత్రణ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమలకు ఆర్టీసి 435 బస్సులు నడస్తున్నాయని, దీనిద్వారా 1.60 లక్షలమంది భక్తులను తిరుమలకు తీసుకువచ్చి తిరిగి తిరుపతికి చేర్చడం జరుగుతుందన్నారు. 23 పార్కింగ్ఎ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు.
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు ఎన్ని మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని అంచనా?
A: రోజుకు సుమారు 1.80 లక్షల నుండి 2 లక్షల మంది భక్తులు.
భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలని టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి ఆదేశించారు?
A: సకల సౌకర్యాలు, కూర్చునే సదుపాయం, రద్దీ నియంత్రణ, వాహనసేవల వీక్షణకు అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: