📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Tirupati: ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

Author Icon By Pooja
Updated: January 19, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల(Tirupati) బైపాస్ రోడ్డులోని కొర్లగుంట కూడలిలో డివైడర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం తొలగించారు. కొర్లగుంటవాసులు డివైడర్ కారణంగా రాకపోకలకు తాము ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగిన జనవాణి కార్యక్రమంలో కూడా కొర్లగుంట వాసులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం కొర్లగుంట కూడలిని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. డివైడర్ కారణంగా తాము లీలామహల్ సర్కిల్ లో యూటర్న్ చేసుకు రావాల్సి వస్తున్నదని దీనితో స్కూల్ కు వెళ్ళే విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్ళే వారు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే కి స్థానికులు తెలిపారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొర్లగుంట స్కరిల్ డివైడర్ ను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

Read Also: Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

Tirupati: The divider was removed for the convenience of the public: MLA Arani

దీనిపై కొర్లగుంట, మారుతీనగర్ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. కూడలిలో స్పీడ్ బ్రేకర్స్ సోమవారం రాత్రికి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు(Tirupati) చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, ఎం.రఘురామ్ , గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ మహేష్ యాదవ్, కార్పొరేటర్ దూది కుమారి , గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యులు గుణ, రుద్ర కిషోర్, చంద్ర, జగదీష్, రాజేష్, మస్తాన్ నాయుడు,బ్యాంక్ శాంతమ్మ, మునస్వామి యాదవ్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆళ్వార్ మురళీ, శిరీషా, సుధాకర్, పురుషోత్తం, దూది శివ, ధరణి, సాయి కుమార్, ఆముదాల వెంకటేష్, కొండా రాజమోహన్, అనిల్, నవీన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu TirumalaBypassRoad TrafficUpdate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.